Thursday, May 2, 2024

చిరంజీవికి పద్మ విభూషన్.. మంచు ఫ్యామిలీ స్ట్రాంగ్ రియాక్షన్

spot_img

మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. దేశంలోనే రెండోవ అత్యున్నతమైన అవార్డు ఆయనకీ రావటంతో యావత్ టాలీవుడ్ నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. రాజకీయాలకు అతీతంగాను చిరంజీవిని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవిపై మంచి కుటుంబం స్పందన ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టామ్ అండ్ జెర్రిల్లా గొడవపడి వీళ్లిద్దరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే ఉంటారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి పద్మవిభూషణ్ రావటంపై మంచు మోహన్ బాబు తాజాగా స్పందించారు. చిరంజీవిపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో అని వేచిఉన్న అందరికి షాక్ ఇస్తూ పాజిటీమ్ కామెంట్స్ చేశారు మోహన్ బాబు. \

అప్పట్లో చిరంజీవికి లెజెండరి అవార్డు ఇచ్చినందుకు.. స్టేజిపై మోహన్ బాబు గొడవ పడ్డారు. కానీ ఇప్పుడు చిరంజీవిని ప్రశంసించారు. ‘నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి నువ్వు అన్ని విధాలా అర్హుడివి. పద్మ విభూషన్‌ అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మోహన్‌ బాబు. మంచు విష్ణు కూడా చిరంజీవికి ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపాడు. ‘నిద్ర లేవగానే శుభవార్త విన్నాను. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్‌ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం’ అని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. ఇక వీరి స్పందన చూసి నెటిజన్ల హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

Latest News

More Articles