Sunday, May 5, 2024

పిచ్చెక్కిందా? సంక్రాంతికి ఎలా విడుదల చేస్తారు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్

spot_img

విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘నా సామి రంగ’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి 15 రోజుల్లో 28.3 కోట్లు వసూలు చేసి లాభాల్లో నిలిచింది. ఈ సందర్భంగా ‘నా సామి రంగ’ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.ఈ సక్సెస్ మీట్ లో నాగార్జున కొన్ని కిఆల్క కామెంట్స్ చేశారు. ఇంతటి విజయం అందించిన అక్కినేని అభిమానులకి నాగార్జున కృతఙ్ఞతలు తెలిపారు. తన అభిమానుల నుండి తనకు లభించిన ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు.

మా నాన్న గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ఆ రోజున నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించి చిత్రాన్ని మొదలు పెట్టడానికి వెళ్తుంటే నా భార్య షాక్ అయింది. ఎక్కడికి వెళ్తున్నావ్ సాయంత్రం వెళ్ళొచ్చుగా అంది. దానికి నేను ‘లేదు ఇప్పుడే వెళ్ళాలి, ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని అన్నాను. అలా అనగానే అందరూ బిత్తర మొహాలేసుకుని చూశారు. ఏమైనా పిచ్చెక్కిందా? సంక్రాంతికి రిలీజ్ ఎలా చేస్తారంటూ అందరూ అన్నారు. ఎవరితో చెప్పినా కూడా మమ్మల్ని ఎవ్వరూ నమ్మలేదు. కానీ మా టీం మాత్రం నమ్మింది. అదే నాకు చాలని అనుకున్నా.. మేం సినిమాను పూర్తి చేశాం అని అన్నారు నాగార్జున.

Latest News

More Articles