Monday, May 6, 2024

నిమ్స్ వైద్యుడికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ. 2.5 లక్షలు లూటీ

spot_img

పంజాగుట్ట నిమ్స్‎ వైద్యుడికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. సీనియర్ రెసిడెంట్‎గా పని చేస్తున్న వైద్యుడు.. ఓఎల్ఎక్స్‎లో ఎలక్ట్రిక్ కుర్చీ అమ్మకానికి పెట్టాడు. జితేంద్ర శర్మ పేరుతో ఓ వ్యక్తి.. వైద్యుడికి ఫోన్ చేశాడు. తనకు కూకట్ పల్లిలో ఫర్నీచర్ దుకాణం ఉందని ఉందని పరిచయం చేసుకున్నాడు. కుర్చీ కొనుగోలు చేస్తా అని చెప్పి.. డబ్బు పంపేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పాడు. నమ్మిన వైద్యుడు.. స్కాన్ చేయడంతో అతని ఖాతా నుంచి రూ.2.58 లక్షలు కొట్టేశాడు. డబ్బులు పోయాయని గ్రహించిన సదరు డాక్టర్.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles