ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకురాలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి గత ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఈ సారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోగా, ప్రస్తుత అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వడంలేదని స్రవంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ కారణంగానే శుక్రవారం రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. నేడో, రేపో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.