Monday, May 6, 2024

రెండో పెళ్లి అందుకే క్యాన్సిల్ చేసుకున్నా: రేణు దేశాయ్

spot_img

రేణుదేశాయ్…పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ..తన పిల్లల గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. అకిరా నందన్, ఆద్య పెద్దగా అవుతుండటంతో సోషల్ మీడియా వారిపై మరింత ఫోకస్ పెంచుతోంది. కొంతకాలం క్రితం రేణుదేశాయ్ రెండో పెళ్లికి రెడీ అయ్యింది. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ పెళ్లి చేసుకోలేదు. ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్లు చెప్పింది.

కాగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి, ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అవ్వడం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పవన్ నుంచి విడిపోయిన తర్వాత అకిరా, ఆద్య చిన్నపిల్లలు కావడంతో రెండో పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు చెప్పినట్లు రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.

కొంతకాలానికి రెండో పెళ్లికి తాను ఒప్పుకున్నట్లు.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు  రేణు దేశాయ్ చెప్పింది. అయితే ఈ సమయంలో తన కూతురు వయస్సు 7ఏళ్లు మాత్రమేనని తాను పెళ్లి చేసుకుంటే పిల్లలకు సమయం కేటాయించలేకపోతానని అనిపించిందని చెప్పింది. అందుకే తాను పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చింది. అయితే త్వరలోనే రెండో పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని రేణు దేశాయ్ పేర్కొంది.

Latest News

More Articles