Saturday, April 27, 2024

వేశ్యలను బుక్ చేసుకోవడం.. ఇంటికొచ్చాక చంపేయడం.. కిచెన్‎లో 14 శవాలు

spot_img

లోకంలో కొంతమంది మహిళలు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, కుటుంబం పరిస్థితుల దృష్ట్యా వేశ్యా వృత్తిలోకి వస్తుంటారు. అటువంటి వారిని టార్గెట్ చేసి ఓ దుర్మార్గుడు కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రువాండ దేశ రాజధాని కిగాలీలో వెలుగుచూసింది.

కిగాలీ పట్టణ శివారులో ఓ 34 ఏళ్ల వ్యక్తి ఒంటరిగా కిరాయికి ఉంటున్నాడు. అతడిని జూలైలో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ, ఇతర నేరాలతో పాటు అత్యాచారం చేశాడనే అనుమానంతో అరెస్టు చేశారు, అయితే ఆధారాలు లేకపోవడంతో బెయిల్ మీద విడుదలయ్యాడు. కాగా.. అదే కేసులలో దర్యాప్తు చేస్తూ.. పోలీసులు మంగళవారం అతని ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు.. అతని ఇంట్లో 10కి పైగా మృతదేహాలను గుర్తించారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

Read Also: నిరుద్యోగులకు అలర్ట్.. టీచర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

నిందితుడికి వారానికోసారి వేశ్యలను ఇంటికి పిలిపించుకునే అలవాటుంది. ఆ క్రమంలో ఇంటికొచ్చిన వేశ్యలను దోచుకొని, గొంతుకోసి చంపేవాడు. చంపిన వారిలో కొంతమంది మృతదేహాలను ఇంట్లోని కిచెన్‎లో గొయ్యి తీసి పూడ్చిపెట్టేవాడు. మరికొంత డెడ్ బాడీలను యాసిడ్‎లో కరిగించేవాడు. ఎవరూ లేని మహిళలను ఎంచుకొని, వారిని ఇంటికి పిలిపించుకొని అంతమొందించేవాడు. అలా ఇప్పటివరకు 14 మందిని చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ ప్రసిద్ధ సీరియల్ కిల్లర్ సిరీస్‎ను చూసి ఇలా చేయడం నేర్చుకున్నానని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles