Saturday, May 4, 2024

పని షురూ.. సమంత ఏం చేస్తోందంటే..!!

spot_img

ఏడాదిపాటు రెస్ట్ అని చెప్పి.. హ్యాపీగా ఎంజాయ్ చేసిన సమంతా మళ్లీ పని మొదలు పెట్టింది. తాజాగా తన పెండింగ్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. ఖుషి సినిమా ప్రమోషన్ల తర్వాత సమంత సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఏడాదిపాటు తాను యాక్టింగ్ కు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యం బాగలేకపోవడంతో ట్రీట్మెంట్ పై ఫోకస్ చేయాలని..తన వ్యాపారాలపై కూడా ఫోకస్ పెట్టాలని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చింది. మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ తనకు నచ్చిన టూర్లకు వెళ్తూ స్నేహితులతో సరదగా గడిపింది.

ఏడాదికాలం పాటు సందడి చేసిన సమంత…తాజాగా రీ ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్ టు వర్క్ అంటూ పోస్టు చేసింది. 22నెలల తర్వాత ఇలా అంటూ తాజాగా పోస్ట్ చేసింది. అయితే ఈ ఖాళీ సమయంలో సమంత ఓ సినీనిర్మాణ సంస్థ కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సమంత చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. కానీ తాను గతంలో నటించిన సిటడియోల్ వర్క్ మాత్రం పెండింగ్ లో ఉంది. రాజ్ అండే డీకె డైరెక్షన్ లో వరణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ సిరీస్ చేసింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన ఈ సిరీస్ రిమేక్ గా ఇండియన్ వెర్షన్ తెరకెక్కింది. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి 2సంవత్సరాలు గడిచింది. సిరీస్ షూటింగ్ అయిపోయినా సమంత ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆ సిరీస్ అక్కడే అగిపోయింది. తాజాగా ఈ సిరీస్ డబ్బింగ్ వర్క్ షురూ చేసింది. దానికి సంబంధించి ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది సామ్.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Latest News

More Articles