Monday, May 6, 2024

వందల మొసళ్లను పరిగెత్తించిన వ్యక్తి

spot_img

చాలామంది ఏదైనా గట్టిగా పట్టుకోవాలంటే మొసటి పట్టు పట్టాలి అంటారు. మొసలి ఒక్కసారి పట్టిందంటే వదలదు. మొసలికి ఏందొరికినా అంతే సంగతులు.. ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి మొసళ్లను ఓ వ్యక్తి పరుగులు పెట్టించాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

ఆ వీడియో ప్రకారం… వందల సంఖ్యలో మొసళ్లు ఉన్న ఓ నదిలో ఓ బోటు ప్రయాణిస్తుంటుంది. బోటు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. ఇంజిన్ శబ్దానికి మొసళ్లు భయంతో ఒడ్డుకు చేరుకుంటాయి. బోటు వేగంగా వెళ్తుండటంతో వందలాది మొసళ్లు నీటిలో పరిగెడుతుంటాయి. కొన్నింటిపై బోటు కూడా వెళుతుంది.

ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ఏ వీడియోను ‘CCTV IDIOTS’ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘వందల సంఖ్యలో ఉన్న మొసళ్లతో ఆడుకోవడం ఏంది సామీ’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈడు మగాడ్రా బుజ్జి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

Latest News

More Articles