Saturday, May 4, 2024

ఇన్ఫెక్షన్లు సోకకుండా.. దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్

spot_img

సిర్పూర్ కాగజ్ నగర్ ఏటూరు నాగారంలో డయాలసిస్ సేవల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. ‘నాడు కిడ్నీ రోగం వస్తే నాడు ప్రాణాలు పోయినంతపని. వ్యయప్రయాసలు, తిండి తిప్పలు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. కానీ నేడు స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు చరమగీతం పాడారు సీఎం కేసీఆర్ గారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశారు. పట్నం దాకా రావాల్సిన అవసరం లేకుండానే, పేద ప్రజల చెంతకే డయాలసిస్ సేవలను తీసుకువెళ్లారు.

BRS Party ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంగా మారాయి. సిర్పూర్ కాగజ్ నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు డయాలసిస్ సేవలు అందిస్తున్నాం అని సగర్వంగా చెప్తున్నాం. ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతి అనుసరిస్తుండగా, పేషెంట్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్ పాస్ లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి, సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైందన్నది అక్షర సత్యం.

Latest News

More Articles