Monday, May 6, 2024

అశ్వరావుపేటలో దంపతుల ఆత్మహత్య

spot_img

ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వరావుపేట పట్టణంలోని మద్దిరావమ్మ గుడి సమీపంలో ఉంటున్న ఎర్రం కృష్ణ (24), ఎర్రం రమ్య(20) లు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే సమయంలో బంధువులు ఇంటికి వచ్చేసరికి తలుపులు తీయకపోవటంతో తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లో ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: డ్రగ్స్ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు

Latest News

More Articles