Sunday, May 5, 2024

తలసాని హ్యాట్రిక్ ఖాయమైందా ?

spot_img

హైదరాబాద్లో 15 నియోజకవర్గాలు ఉండగా సనత్ నగర్ నియోజకవర్గం ఎప్పుడు ప్రత్యేకమే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయం హాట్ హాట్ గానే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వారంతా తన వైపే ఉన్నారని తలసాని శ్రీనివాస యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా ఈ సారి కూడా బిఆర్ఎస్ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తలసాని ఆశపడుతున్నారు.

గతంలో తలసాని సికింద్రాబాద్ లో పోటీ చేసి గెలిచారు. కానీ 2014లో సనత్‌నగర్‌లో గెలిచారు. 2018 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు సెటిలర్స్ లో కేసీఆర్ పాలనపై ఉన్న నమ్మకంతో టి‌డి‌పిని అభిమానించే వారు, సెటిలర్స్ అంత కూడా తలసానికి మొగ్గుచూపారు. అలాగే వైసీపీ, జనసేనలని అభిమానించే వారు సైతం తలసానికి ఓటు వేశారు. దీంతో భారీ మెజారిటీతో తలసాని గెలిచారు.

ఇక మళ్ళీ కే‌సి‌ఆర్ కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. నియోజకవర్గానికి చాలా అభివృద్ధి పనులు చేశారు. ఈసారి ఎన్నికలలో తలసాని బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంటే, తలసానికి పోటీగా బి‌జే‌పి నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో రెండుసార్లు గెలిచిన మర్రి శశి ధర్ రెడ్డి బిజెపిలో చేరి ఇప్పుడు తన స్థానాన్ని మళ్లీ సంపాదించుకోవాలని పట్టుతో ఉన్నారు.ఇక రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అటు టిడిపి కూడా ఈసారి సనత్ నగర్ లో పోటీ చేస్తానని ప్రకటించడంతో సనత్ నగర్ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే అన్నివర్గాల ఓట్లతో పాటు సెటిలర్స్ ఓట్లు మళ్ళీ తనకే పడతాయని ధీమాతో ఉన్నారు తలసాని.

Latest News

More Articles