న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. భారత బ్యాటర్లు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో కొనసాగుతున్నారు.
Also Read.. మంత్రి ఎర్రబెల్లికి పెరుగుతున్న మద్దతు
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచకప్లో ఐదు ఇన్నింగ్స్ల్లో 157 పరుగులే చేశాడు. దీంతో అతడి రేటింగ్ పాయింట్లు 829కి పడిపోయాయి. గిల్ 823 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. మరో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఏడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్పై సెంచరీ మిస్ (95) చేసుకున్న విరాట్ కోహ్లీ మూడు స్థానాలు మెరుగై డేవిడ్ వార్నర్తో కలిసి ఐదో స్థానాన్ని పంచుకుంటున్నాడు. రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
Also Read.. కర్ణాటక గోస తెలంగాణకు అవసరమా.. కేటీఆర్ కీలక కామెంట్స్
బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ (670 పాయింట్లు) టాప్ లో ఉండగా.. ప్రపంచకప్లో ఇప్పటివరకు ఆరు వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక స్థానం మెరుగై రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కుల్దీప్ యాదవ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో భారత్ నుంచి హార్దిక్ పాండ్య(19 పాయింట్లు) ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. షకీబ్ అల్ హసన్ (324 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.