Tuesday, May 7, 2024

మంత్రి ఎర్రబెల్లికి పెరుగుతున్న మద్దతు

spot_img

జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలు, కుల సంఘాలు, యూత్ సభ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి పూర్తి మద్దతు తెలుపుతున్నారు.

Also Read.. గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించిన ముస్లిం, మైనార్టీలు

తాజాగా పాలకుర్తి మండలం తిర్మలగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, మాజీ వార్డు మెంబర్ సింగపురం పుష్ప అధ్వర్యంలో, చీమలబాయి తండాకు చెందిన రిస్క్ టేకేర్ యూత్ ఆధ్వర్యంలో 100 మంది, రాయపర్తి మండలం కాట్రపల్లి యూత్ నాయకులు మండల సతీష్ అధ్వర్యంలో 20 మంది, భూరాహన్ పల్లి గ్రామానికి చెందిన కౌండిన్య యూత్ సభ్యులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest News

More Articles