న్యూఢిల్లీ: పాకిస్తాన్తోనూ శతకం బాదిన వార్నర్.. తాజాగా నెదర్లాండ్స్తోనూ ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీలతో చెలరేగిపోయాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. వార్నర్కు ఇది ఈ ప్రపంచకప్లో వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.
Also Read.. బీజేపీకి భారీ షాక్.. డీకే అరుణ, విజయశాంతిల షాకింగ్ డెసిషన్ ?
40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన 91 బంతుల్లో వార్నర్ సెంచరీ కొట్టిండు. ఈ సందర్భంగా ఫుష్ప స్టయిల్ లో తగ్గేదే లే అంటూ చేసుకున్న సెలబ్రేషన్స్ అందరిని ఆకట్టుకున్నది. తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో వార్నర్.. వరల్డ్ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ (7) తర్వాత ఆరు సెంచరీలతో సచిన్ టెండూల్కర్తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా వన్డే కెరీర్లో వార్నర్కు ఇది 22వ శతకం.