న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా అద్భుత విజయంతో ఆరోసారి టైటిల్ను గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. ఫైనల్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది. ఇందులో టీమిండియా క్రికెటర్ల హవా కొనసాగింది. 12 మందిని ప్రకటించగా.. ఇందులో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు టీమిండియా నుంచే ఉన్నారు. ఐసీసీ ఈ జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్గా ప్రకటించడం గమనార్హం.
Also Read.. రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఆడిటోరియం కూలి ఇద్దరు మృతి
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జాబితాను ఇయాన్ బిషన్, కస్ నైడూ, షేన్ వాట్సన్, వసీం ఖాన్ (ఐసీసీ జనరల్ మేనేజర్, క్రికెట్), అహ్మదాబాద్కు చెందిన జర్నలిస్టు సునీల్ వైద్య లతో కూడిన కమిటీ రూపొందించింది. ఇందులో రోహిత్తో పాటు కోహ్లీ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, మహ్మద్ షమీలు స్థానం పొందారు. ఆసీస్ నుంచి గ్లెన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా చోటు దక్కించుకోగా.. సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్, కివీస్ నుంచి డారెల్ మిచెల్ ఉండగా లంక యువ పేసర్ దిల్షాన్ మధుశంక, సఫారీ పేసర్ గెరాల్డ్ కోయిట్జ్ 12 మందిలో చోటు దక్కించుకున్నారు.
Also Read.. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..?
టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ టీం మెంబర్లు వీరే: విరాట్ కోహ్లీ (765 పరుగులు), రోహిత్ శర్మ (597), క్వింటన్ డికాక్ (594 ), డారెల్ మిచెల్ (552), కెఎల్ రాహుల్ (452), గ్లెన్ మ్యాక్స్వెల్ (400), రవీంద్ర జడేజా (120 రన్స్, 16 వికెట్లు), జస్ప్రిత్ బుమ్రా (20 వికెట్లు), దిల్షాన్ మధుశంక (21), ఆడమ్ జంపా (23), మహ్మద్ షమీ (24), 12వ ప్లేయర్: గెరాల్డ్ కొయెట్జ్ (20 వికెట్లు)
ICC team of the tournament.
Rohit Sharma and Bumrah only two to feature in the 2019 and 2023 ICC team. pic.twitter.com/Pb4RTKz6oZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023