నేటితో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నందున, గ్రామ పంచాయతీ విధులను నిర్వహించడానికి ప్రత్యేక అధికారులు, ఇన్చార్జ్ల కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవోఎం 5ను జారీ చేసింది. శుక్రవారం నుంచి తహశీల్దార్ / మండల పరిషత్ అభివృద్ధి అధికారి / వ్యవసాయ అధికారి / మండల విద్యా అధికారి / మండల పంచాయతీ అధికారి లేదా తత్సమాన స్థాయి అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త సర్పంచ్ల బాధ్యతలను స్వీకరించే వరకు గ్రామ పంచాయతీ విధులను ఈ అధికారులే నిర్వహిస్తారు.
ఇక ఇదిలా ఉండగా.. మా సర్పంచ్లు కేవలం పదవీ విరమణ పొందుతున్నారని.. ప్రజాసేవని మర్చిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. ఐదేళ్లపాటు ప్రజలకు సేవలందించిన సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్ల పాత్ర ఎనలేనిదని ఎక్స్లో రామారావు అన్నారు.