హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలు ఈ నెల 9న విడుదలయ్యే అవకాశం ఉంది. ఆరోజు ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.