ఉత్తర్ప్రదేశ్లో విషాదకర ఘటన జరిగింది. ఓ యువకుడు తమ ప్రేమకు అడ్డు చెబుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లిని గొంతు కోసి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆగ్రాలోని భావనా అరోమా హౌసింగ్ సొసైటీ పరిధిలో ఫుట్వేర్ వ్యాపారి అయిన ఉదిత్ బజాజ్, అంజలి బజాజ్ దంపతులకు ఓ కుమార్తె ఉంది.
బుధవారం తల్లిని మహాదేవ్ ఆలయానికి రప్పించిన కుమార్తె.. ఆమెకు తోడుగా వచ్చిన తండ్రికి తెలివిగా ఫోను చేసి మరోచోటుకు వెళ్లేలా చేసింది. కాసేపటికి తిరిగి వచ్చిన ఉదిత్కు అక్కడ భార్య కనిపించలేదు. తన భార్య అంజలి కనిపించడం లేదని ఉదిత్.. సికంద్ర పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం మహాదేవ్ ఆలయ సమీపంలో అంజలి మృతదేహాన్ని గుర్తించారు. ఈ హత్య వెనుక అంజలి కుమార్తె, ప్రాకర్ స్నేహితుడి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.