Tuesday, May 7, 2024

పోలీసులు – మావోయిస్టుల మధ్య కాల్పులు.. 6 నెలల బాలుడు మృతి

spot_img

ఛత్తీస్ గఢ్: బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్ వన్డి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల క్రాస్ ఫైరింగ్ లో అదే గ్రామానికి చెందిన 6 నెలల బాలుడు మృతి చెందగా.. ఒక మహిళకు గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Latest News

More Articles