అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు జరిగాయి. చికాగోలోని రోమియోవిల్లే ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబాన్ని దుండగులు కాల్చి చంపారు. చికాగోలో సబర్బన్ హోమ్లో నివశిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులతో పాటు వారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మూడు కుక్కల్ని ఘోరంగా కాల్చి చంపారని న్యూయార్స్ పోస్ట్ తెలిపింది.
ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రోమియోవిల్లే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారు ఆల్బర్ట్ రోలన్, జోరైడా బార్టోలోమీ, ఆడ్రియల్ (10), డియోగో (7)గా పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి యజమాని పనికి వెళ్లకపోవడం..బంధువుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్కి స్పందించకపోవడంతో.. బంధువులే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..హత్య జరిగిన ఇంటిని తనిఖీ చేశారు. అప్పుడే ఆ ఇంట్లో భార్యాభర్తలతో సహా, ఇద్దరు చిన్నారుల డెడ్ బాడీలు పోలీసులకి కనిపించాయి.