జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ(బుధవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయగా.. టికెట్లను హాట్ కేకుల్లా భక్తులు బుక్ చేసుకున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేసిన 4 నిమిషాల్లోనే భక్తులు పొందారు. 20 నిముషాల వ్యవధిలో వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గంటా 55 నిమిషాల వ్యవధిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అన్ని అయిపోయాయి.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఆలయాధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన…వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన