మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ దర్గా దగ్గర ఈత కోసం వెళ్లి చెరువులోకి దిగి, ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. కౌకూరి దర్గాలో గంధం పండుగ సందర్భంగా లంగర్ హౌస్ నుంచి వచ్చిన పర్వీజ్, నాంపల్లి నుంచి వచ్చిన సలీం ఈత కోసం ప్రాణాలు పొగొట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. పర్వీజ్ దేహం కోసం గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, బోట్ల సహాయంతో వెతుకుతున్నారు.
ఇది కూడా చదవండి: దసరా సేల్.. రూ. 86 వేల ఫోన్.. రూ. 40 వేలకే..