Sunday, May 5, 2024

డీజీపీ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

spot_img

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్ లతోసహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు. పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

డీజీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన వారిలో చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీ కుమార్, అడిషనల్ డీజిలు రాజీవ్ రతన్, సంజయ్ కుమార్ జైన్, ఐజి లు కమల్ హాసన్ రెడ్డి, ఎం.రమేష్, శివకుమార్ లున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Latest News

More Articles