మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న హీరో నవదీప్ ఈ రోజు నార్కోటిక్ బ్యూరో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A29గా ఉన్న హీరో నవదీప్ను అధికారులు విచారిస్తున్నారు.
డ్రగ్స్ సప్లయర్ రామచందర్తో నవదీప్కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీయనున్నారు. హీరో నవదీప్ ద్వారానే ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై బీజేపీ నాయకుల దాడి
హీరో నవదీప్ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్ బ్యూరో అధికారులు.. ఆయన ముందు 20 ప్రశ్నలు ఉంచినట్లు తెలుస్తోంది.
రాంచంద్తో పరిచయాలపై ప్రశ్నలు
నవదీప్, రాంచంద్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం
ఇద్దరు కలిసి ఎప్పుడు, ఎక్కడ, ఎలా డ్రగ్స్ తీసుకున్నారు..
రాంచంద్తో ఉన్న పరిచయం ఏంటి?
రాంచంద్ చివరిసారిగా ఎప్పుడు కలిశారు?
రాంచంద్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చేవాడు?
మాజీ ఎంపీ విట్టల్ రావు కుమారుడు సురేష్తో ఉన్న పరిచయాలు ఏంటి?
సురేష్, రాంచంద్లతో కలిసి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా?
రాంచంద్, సురేష్లకు ఎప్పుడైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా?
స్నార్ట్ పబ్ వ్యవహారాలపై ఆరా?
ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా చేశారా? లాంటి ప్రశ్నలతో పాటు మరికొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.
సప్లయర్ రాంచందర్ పట్టుబడినప్పటి నుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ కొరకు హైకోర్టును ఆశ్రయించారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి 41ఏ సీఆర్పీపీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్కు హైకోర్టు సూచించింది. దాంతో నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసుల జారీ చేసి, విచారణకు పిలిచారు.