Monday, May 6, 2024

బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 6 మంది దుర్మరణం

spot_img

మహబూబ్ నగర్ జిల్లా: వారం సంత కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకున్నది.

Also Read.. గీతం యూనివర్శిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులలో మేడిగడ్డ తండా, నందారం, బాలానగర్, బీబీనగర్ తాండ, బీహార్ కు చెందిన కూలీలు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆగివున్న ఆటో, బైక్‌ను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టిందని, ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారని, ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Also Read.. 7నెలల గర్భిణీ హత్య కేసులో కోర్టు తీర్పు

Latest News

More Articles