Saturday, May 4, 2024

శ్రీశైలం ఆలయంలో బోనులో చిక్కిన ఎలుగుబంటి

spot_img

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత నాలుగు రోజులుగా ఎలుగుబంటి హల్చల్ చేస్తుంది. ఆలయ సమీపంలో సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శిఖరేశ్వరం నిత్యం భక్తులు సంచరించే ప్రదేశం కావడంతో అప్రమత్తం అయిన అటవీశాఖ అధికారులు శిఖరేశ్వరంలో బోను ఏర్పాటుచేశారు. ఆ బోనులో గురువారం రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎలుగుబంటి చిక్కింది. రెస్క్యూ టీమ్ మరియు అటవీ శాఖ సిబ్బంది ఎలుగుబంటిని బంధించారు. అనంతరం వెలుగోడులోని సూదుం అటవీ ప్రాంతానికి తరలించారు.

Latest News

More Articles