Saturday, May 4, 2024

వరంగల్లో ఘోరరోడ్డు ప్రమాదం..బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం.!

spot_img

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన దగ్గర వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరంతా 17ఏండ్ల లోపు వయస్సున్నవారే. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికిచెందిన మల్లేపాకసిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్ లు ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ బస్సు హన్మకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వెళ్తోంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజీఎం లో చికిత్స పొందుతూ మరణించాడు.

వీరిలో గణేశ్ బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో పాస్ అయ్యాడు. అతను తన ముగ్గురు స్నేహితులతో క లిసి సాయంత్రం పార్టీ చేసుకుని ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు సుమారు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. వీరంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలం వద్ద మలుపు ఉండటం..రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పరగడుపున చక్కెర లేని బ్లాక్ కాఫీ తాగితే ఎన్ని ప్రయోజనాలో.!

Latest News

More Articles