Saturday, May 4, 2024

సూర్యపేట-కోదాడ హైవేపై ఘోర ప్రమాదం..ఆరుగురు దుర్మరణం.!

spot_img

సూర్యపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఆరుగురు మరణించారు. ఆగి ఉన్న లారీని వెనకనుంచి వచ్చి కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురుఘటనాస్థలంలోనే మరణించగా..గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. అయితే ఈ ఘటనలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: పంది కిడ్నీ అమర్చి ప్రాణాలు కాపాడిన వైద్యులు.!

Latest News

More Articles