సీఎం కేసీఆర్ను ఓడించం కష్టమని బీజేపీ ముఖ్య నేత మురళీధర్రావు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలుతో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు. శుక్రవారం మురళీధర్ రావు హైదరాబాద్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలిగింపు సబబే అన్నారు. దాంతో బండి సంజయ్కి కలుపుగోలుతనం లేదని.. అందుకే పదవి నుంచి తొలిగించారంటూ వస్తున్న కథనాలకు మురళీధర్రావు వ్యాఖ్యలు బలం చేకూర్చినట్టయ్యింది. బీజేపీ ఎంపీ అర్వింద్ సైతం బండి సంజయ్ ఉన్నన్నాళ్లూ పార్టీలో గొడవలు ఉన్నాయని, ఇప్పుడు గ్రూపులు, గొడవలు లేవని ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో బండి సంజయ్ అభిమానులు మురళీధర్రావు, అర్వింద్పై గుర్రుమంటున్నారు. కాగా.. మురళీధర్ రావు వ్యాఖ్యలతో ఎన్నికలకు ముందే బీజేపీ చేతులెత్తేసిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.