Sunday, May 5, 2024

మాణిక్యం ఠాగూర్‌‎పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. నోటీసులు ఎవరికి పంపాలో తెలియడం లేదా?

spot_img

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్‎పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై పరువు నష్టం దావా వేస్తానన్న మాణిక్యం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని.. ఆ నోటీసులు తప్పుడు అడ్రస్‎కి పంపినట్టున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని రూ. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే అన్నారని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన ఆ వార్తలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు కదా.. కనీసం తాను చేసిన 50 కోట్ల లంచం వ్యాఖ్యలపైన వివరణ కూడా ఇవ్వలేదని అన్నారు. అయినా మీరు పంపాలనుకుంటున్న పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని అన్నారు. ఆ నోటీసులను తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని కేటీఆర్ సూచించారు.

Read also: కొత్త పెళ్లి కొడుకు ప్రాణం తీసిన కరెంట్ తీగ

Latest News

More Articles