జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనా స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో బీర్పూర్ గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు అడ్డగించి గొడ్డలితో నరికి చంపారు. అనంతరం మృతుని సెల్ ఫోన్ తో దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.