Saturday, May 4, 2024

చెట్టును ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతిచెందిన సర్పంచ్

spot_img

అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఓ సర్పంచ్ మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామ సర్పంచ్ కొమురరెడ్డి శనివారం తెల్లవారుజామున కారులో హుజూరాబాద్ వస్తున్నాడు. ఈ క్రమంలో శంకరపట్నం మండలం, కొత్తగట్టు దగ్గరకు కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో కొమురరెడ్డికి తీవ్రగాయాలై స్పాట్‎లోనే చనిపోయాడు. అటుగా వచ్చిన స్థానికులు ప్రమాదాన్ని చూసి, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆయన మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్ మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Latest News

More Articles