హైదరాబాద్: చైనాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారిణి ఇషాసింగ్ మరో రెండు సిల్వర్ మెడల్స్ దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ విభాగంలో రెండు వెండి పథకాలను సాధించి, ఆసియా క్రీడల్లో వరుసగా మొత్తం నాలుగు పథకాలను దక్కించుకున్న క్రీడాకారిణిగా ఇషా చరిత్ర సృష్టించిందని సిఎం అన్నారు.
Also Read.. నిరుద్యోగులకు అలర్ట్…600 పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు..!!
ఈ సందర్భంగా ఇషాసింగ్ ను సీఎం కేసీఆర్ మరోసారి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆసియా క్రీడల్లో ఇషాసింగ్ రాణిస్తూ, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతిని మరో మారు చాటిందని సీఎం తెలిపారు.