సిద్దిపేట: గత ఎన్నికల్లో హరీశ్రావుకు లక్షపైగా మెజారిటీ ఇచ్చి బ్రహ్మండమైన రికార్డును నెలకొల్పారని, హరీశ్రావు పనితనం, మన సిద్దిపేట పటుత్వంగానీ.. మళ్లీ ఆ రికార్డు సిద్ధిపేటకే దక్కాలి.. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో హరీశ్రావును గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు.
Also Read.. సీఎం అయినా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు
సిద్దిపేటకు హైదరాబాద్ సమీప ప్రాంతమని, కంటోన్మెంట్ దాటితే 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు. హరీశ్రావు పట్టుబట్టి సిద్దిపేటకు ఐటీహబ్ను తీసుకువచ్చిండని ప్రశంసలు కురిపించారు. రాబోయే రోజుల్లో ఒక అద్భుత వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట తయారవుతుందన్నారు.