తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా పది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 8,44,558కి చేరుకుంది. కొత్తగా ఒకరు రికవరీ అయ్యారు. అందువల్ల మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8,40,392కి చేరింది. కొత్తగా ఎవరూ మరణించలేదు. మొత్తం మరణాల సంఖ్య 4111గా ఉంది.
తెలంగాణలో రికవరీ రేటు 99.51శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల 5 ఉండగా..తెలంగాణలో కొత్త కోవిడ్ జెన్ .1 వేరియంట్ కేసులు 2 ఉన్నాయని పేర్కొంది. నిన్న 989 మంది కోవిడ్ టేస్టులు నిర్వహించారు. మొత్తం టెస్టుల సంఖ్య 3,91,77,325కి చేరింది. 12 టెస్టుల రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నారా?అయితే ఈ రెండు పనులు చేశాకే వాకింగ్ మొదలుపెట్టండి..!