Sunday, May 5, 2024

అల్లకల్లోలంగా బిపర్‌జాయ్‌.. ఎక్కువ రోజులు కొనసాగిన తుఫాన్‎గా రికార్డ్

spot_img

అతి తీవ్ర తుఫాను బిపర్‌జాయ్‌ గుజరాత్‌ తీరాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్‌ ప్రాంతంలోని లఖ్‌పత్‌ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బిపర్‌జాయ్‌ తుఫాను కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే.. అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా కొనసాగిన తొలి తుఫానుగా ఇది నిలిచిపోతుందన్నారు. జూన్ 6న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ తుఫాన్ అత్యధిక రోజులు కొనసాగిన తుఫాన్‎గా రికార్డుకెక్కింది.

కాగా, గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో బిపర్‌జాయ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తన్నది. బలమైన ఈదురుగాలుల ధాటికి వందల సంఖ్యలో చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇండ్లు కూలిపోతున్నాయి. సౌరాష్ట్ర, కచ్‌ తీరాలతోపాటు ద్వారకలోని గోమతి ఘాట్‌, దమణ్‌ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగామారింది. భీకర గాలులతో కచ్‌ జిల్లాలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కాగా, తుఫాను తీరందాటిన ప్రాంత పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ద్వారకలోని ప్రాచీన ఆలయం సహా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను, గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలోని సోమ్‌నాథ్‌ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Latest News

More Articles