రంగారెడ్డి జిల్లా మణికొండలో ఓ కారులో మృతదేహం లభించింది. రోడ్డు పక్కన పార్క్ చేసిన మారుతి వ్యాన్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును పరిశీలించారు. కారు డ్రైవర్ సీటు వెనుకలో మృతదేహాన్ని గుర్తించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? అనే సమాచారాన్ని స్వేకరిస్తున్నారు. కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.