Monday, May 6, 2024

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం

spot_img

జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ విషయాన్ని కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి (ప్రిసైడింగ్) మహేశ్వర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Also Read.. అసెంబ్లీలో ఫూలే విగ్రహం.. ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం

30 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్ హాజరు కావాల్సి ఉన్నా..  కేవలం 20వ, వార్డు సభ్యురాలు పొనగంటి విజయలక్ష్మి మాత్రమే హాజరైనట్లు పేర్కొన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్నారు. గత 20 రోజులుగా జమ్మికుంట ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తీవ్ర చర్చకు తెరలేపింది.

Latest News

More Articles