న్యూఢిల్లీ : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి వైజయంతి మాల బాలి, పద్మ సుబ్రమణ్యంలకు, బీహార్ కు చెందిన బిందేశ్వర్ పాఠక్ లకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది. వీరితోపాటు 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించారు.