ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హనుమకొండలోని తన స్వగృహంలో తన సిబ్బందితో కలిసి దసరా సంబరాలు నిర్వహించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి. ఆయుధ పూజ నిర్వహించారు. జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి ఎర్రబెల్లి.
దసరా సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి. హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.