Saturday, May 4, 2024

బీజేపీకి గుడ్ బై ?

spot_img

కర్ణాటక ఫలితాల తరువాత దేశంలో బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి నేతల్లో కలవరం మొదలైంది. భారీ చేరికలు ఉంటాయంటూ ఊదరకొడుతూ వస్తున్న బీజేపీ నాయకులు అంత ఇప్పుడు ఢీలా పడ్డారు. చేరికలు పక్కన పెడితే అసలు పార్టీలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారో తెలియని అయోమయ పరిస్థితి. తెలంగాణ బిజెపిలో ఒకవైపు మతతత్వ బ్యాచ్ ఉంటే, మరోవైపు జంపింగ్ జిలానీల బ్యాచ్ ఒకటి తయారైంది. తాజాగా ఈ జంపింగ్స్ నుండి బీజేపీకి పెద్ద సమస్యే వచ్చి పడింది.

తెలంగాణలో బీజేపీకి సీన్ లేదని బీఆర్ఎస్ ఎప్పటి నుండో చెప్తున్న మాటలను ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలే బాహాటంగా చెప్తున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, రాజ్ గోపాల్ వంటి నాయకులూ తిరుగుబాటుకు సిద్దమవ్వగా.. తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలపై తాజాగా కొండా క్లారిటీ ఇచ్చారు. తానూ బీజేపీని వీడటం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులనే బీజేపీలోకి ఆహానిస్తున్నట్టు కొండా చెప్పారు.

Latest News

More Articles