Monday, May 6, 2024

వినాయకుడి చందా విషయంలో గొడవ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి

spot_img

రాష్ట్రవ్యాప్తంగా గణేషుడి ఉత్సవాలు సంబరంగా జరుపుకుంటున్నారు. విగ్రహం పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం వరకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అయితే ఈ నవరాత్రులలో మండపం వద్ద అయ్యే ఖర్చు కోసం చందాలు వసూలు చేస్తుంటారు. ఇలా వసూలు చేస్తున్న చందాలు.. ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చాయి.

Read Also: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ముందు 20 ప్రశ్నలు

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వినాయకుడి విగ్రహం ఏర్పాటుచేశారు. కాగా.. ఆ వినాయకుడి చందా డబ్బుల విషయంలో రమేష్, దుర్గయ్య అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి క్షణికావేశంలో దుర్గయ్యను రమేష్ కత్తితో పొడిచాడు. అనంతరం భయంతో జోగిపేట పోలీస్ స్టేషన్‎కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్గయ్య కుటుంబసభ్యులు ఇనుపరాడ్లతో రమేష్ కుటుంబసభ్యులపై దాడిచేశారు. ఈ గొడవలో దుర్గయ్య, రమేష్ బంధువులు గాయపడి జోగిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles