ఆంధ్రప్రదేశ్: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ఎదురెదురుగా వచ్చిన తుఫాన్ వాహనం, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read.. గుడ్న్యూస్.. SBIలో 2000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జీతం ఎంతంటే..!!
సమాచారం అందుకొని ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని తిరుపతిలోని రుయా అసుపత్రికి తరలించారు. బాధితులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా పోలీసులు గుర్తించారు.