Tuesday, May 7, 2024

తెలంగాణలో మరో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీలు

spot_img

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌ల బదిలీలను బదిలీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తమ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే బదిలీ అయిన వారిలో 10 మందికి ప్రభుత్వం పోస్టింగులను ఇచ్చింది. తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన  ఐఏఎస్‌ల కు పోస్టింగ్ లను ఇచ్చింది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్- నీటిపారుదల శాఖ ప్రత్యేక కారుదర్శిగా నియామకం. షేక్ రిజ్వాన్ పాషా- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ని జనగామ కలెక్టర్ గా నియామకం. మిక్కిలినేని మను చౌదరి- కామారెడ్డి అదనపు కలెక్టర్,సిద్దిపేట కలెక్టర్ గా నియామకం, Ch. శివలింగయ్య- జనగామ కలెక్టర్, శైలజా రామయ్యర్- దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి:విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు రైతులు మృతి

Latest News

More Articles