Friday, May 10, 2024

కేసీఆర్ పాలన లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు

spot_img

సూర్యాపేట: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే  నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

జోగులాంబ నుంచి ఆలంపూర్ వరకు అందరూ బిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయినప్పటికీ సూర్యాపేట మాత్రం బొడ్రాయిలానిలిచి గెలిచిందని అన్నారు. మళ్లీ ఎన్నికల వరకు ఒక్కటి లేకుండా అన్ని గెలుస్తామన్నారు. మంచి కొరకు నిలబడి త్యాగాలకు సిద్ధపడిన చరిత్ర సూర్యాపేట ప్రజలదని అందుకు నా ఈ గెలుపే నిదర్శనం అన్నారు. బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జరిగిన లోటుపాట్లను ఆలోచన చేసుకావాలని అవి మరల పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.

ప్రతిపక్ష నాయకులు కుట్రపూరితంగా  పదేళ్లు అధికారంలో ఉన్నారని ఒక వాదన తీసుకువచ్చి తప్పుదోవ పట్టించారని అన్నారు. రెండుసార్లు తెలంగాణలో అధికారం ఇస్తే కెసిఆర్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా చేశారని అన్నారు. రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ గెలిచేందుకు నీళ్లు కరెంటు రోడ్లు సరిపోతాయని అంటున్నారన్నారు. కెసిఆర్కు ఉన్న విజన్,  ఆలోచన ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్లకు లేదని అన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష బాధ్యతను ఇచ్చారని ప్రజల ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాలన్నారు.

Latest News

More Articles