Thursday, May 2, 2024

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయం

spot_img

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయమన్నారు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు క్రెడిబిలిటీ లేదు. మంత్రి పదవి కాపాడుకోవడం కోసం వెంకట్ రెడ్డి తాపత్రయపడుతున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడిన వాళ్లంతా కనుమరుగయ్యారన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. విద్యార్థులు ఆత్మహత్యలు చేకుంటున్నారు. విద్యా శాఖపై సమీక్షలు చేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యార్థుల బలిదానాలు జరిగాయి. సంక్షేమ శాఖలన్నీ సీఎం రేవంత్ దగ్గరే ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నారు. శ్రీచైతన్య,నారాయణ కాలేజీల్లో ఫీజులు భారీగా పెంచారని..అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గెల్లు.

ఇది కూడా చదవండి: ఆదివారం హైదరాబాద్ లో మటన్ షాపులు బంద్

Latest News

More Articles