Thursday, May 2, 2024

22 లక్షల విలువైన బంగారం స్వాధీనం

spot_img

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమ బంగారం పట్టుబడింది. జెడ్డా నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుడి వద్ద 403 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు.

నిందితుడు బంగారాన్ని పొడిగా మార్చి వాటిని మూడు క్యాప్సిల్స్ రూపంలో తయారు చేసి.. పురుషాంగం వద్ద పెట్టుకుని తరలించే ప్రయత్నం చేశాడు. ప్రయాణికుడి కదలికలపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. అక్రమ బంగారం పట్టుబడింది.

అక్రమ బంగారం క్యాప్సిల్స్ ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు..నిందితుడిని విచారిస్తున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.21,63,707 ఉంటుందని అంచనా వేశారు అధికారులు.

Latest News

More Articles