తెలంగాణలో సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తోన్న సైబర్ నేరగాళ్లు ప్రముఖులనూ కూడా వదిలిపెట్టడం లేదు. వారి అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేశారు. అకౌంట్ హ్యాక్కు గురైనట్లు గుర్తించిన రాజ్భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: పట్నం బాటపట్టిన పల్లెవాసులు.. టోల్ ప్లాజాలన్నీ వాహనాలతో రద్దీ
గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్ చేయడం గమనార్హం.