అభివృద్ధికి చిరునామా, దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రం. అలాంటి తెలంగాణకి ఆయువు పట్టు అయిన హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ నియోజిక వర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల విజన్ కి తగ్గట్టు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎడతెరపి లేని డవలప్ మెంట్ పనులకు నిత్యం శ్రీకారం చుడుతున్నారు. మాట మీద నిలబడే నాయకుడిగా.. మాస్ లీడర్ గా పేరున్న ప్రకాష్ గౌడ్ తాజాగా హిమాయత్ సాగర్ ఆయకట్టు అభివృద్ధి పనులని చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా.. సాగునీటి దినోత్సవాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్ వద్ద వాలంతరిలో నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్డీఓ చంద్రకళ, zptc తనివిరాజ్, ఛైర్మన్ రేఖ యాదగిరి, మేయర్ మహేందర్ గౌడ్ లు పాల్గొన్నారు.