Sunday, May 5, 2024

ఆకలితో బిర్యానీ ఆర్డర్ చేసి తింటుంటే ఏం వచ్చిందో తెలుసా?

spot_img

స్నేహితులంతా కలిసి తినడానికి బయటకు వెళ్లారంటే.. ఇచ్చే ఆర్డర్ ఒక్కటే.. అదే బిర్యానీ. అయితే బిర్యానీకి ఉండే డిమాండ్‎ను కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఏదో మొక్కుబడిగా, హడావుడిగా వండుతూ, క్వాలిటీ గురించి పట్టించుకోవడం లేదు. దాంతో ఆహారంలో బొద్దింకలు, బల్లులు, ఇంకా ఏవేవో వస్తుంటాయి. వాటిని చూడకుండా తినేవారు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Read Also: వరంగల్ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

రాజేంద్రనగర్ డెయిరీ ఫామ్‌ చౌరస్తాలో ఉన్న డెక్కన్ ఎలైట్ హోటల్‌కు శుక్రవారం మధ్యాహ్నం ఓ 8 మంది స్నేహితులు వెళ్లారు. అక్కడ వారు బిర్యానీ ఆర్డర్‌ చేసి తిన్నారు. ఆకలిగా ఉన్న వారంతా బిర్యానీ ఆర్డర్‌ టేబుల్‌పైకి రాగానే ఫాస్ట్‌గా తినేశారు. కానీ చివరలో తమ ప్లేట్లలో ఒక చిన్న తోక వంటిది కనిపించింది. పరిశీలించి చూడగా అది బల్లి అని గుర్తించి, యువకులంతా షాక్‌ అయ్యారు. ఘటనపై హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. కాసేపటికే వారందరికీ అక్కడే వాంతులు అయి, అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన స్థానికులు అస్వస్థతకు గురైన ఎనిమిది మంది యువకులను వెంటనే అత్తాపూర్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారు. బిర్యానీలో బల్లి వచ్చిన సంఘటనపై రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest News

More Articles